నవతెలంగాణ-మణుగూరు
కార్మిక పక్షపాతి సౌమ్యుడు, వామపక్ష వాది తాళ్లూరి కృష్ణమూర్తి (67) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం మరణ వార్త తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు, సీపీఐ(ఎం), సీపీఐ వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభిమానులు ప్రముఖులు ఆయన మృతికి సంతాప సానుభూతి తెలిపారు. తాళ్లూరు కృష్ణమూర్తి ఏన్కూరు మండలం పోరాటాల గడ్డ ఉద్యమాలకు పుట్టినిల్లు లచ్చగూడెం గ్రామంలో తాళ్లూరు కోటయ్య అన్నపూర్ణమల రెండవ సంతానం. ఆయన తోడ ఒక అక్క, నలుగురు చెల్లెలు, భార్య సంధ్యారాణి, కుమారులు రాము, రఘు ఉన్నత చదువులు అనంతరం వివిధ ఉద్యోగాలలో స్థిరపడ్డారు.
కృష్ణమూర్తి తండ్రి కోటయ్య స్వతంత్ర సమరయోధులు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలలో పాల్గొన్నారు. అనేకసార్లు నిర్బంధాల గురయ్యారు. గుల్బర్గా జాల్నా లలో జైలు జీవితం అనుభవించారు. కృష్ణమూర్తి పెదనాన్నలు కోదండరామయ్య, కాంతయ్య ు కూడా రజాకార్లకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలలో పాల్గొన్నవారు. కోదండరామయ్య తూతక లింగన్నపేటలో ఎన్కౌంటర్ గురయ్యారు. కృష్ణమూర్తి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్లో క్రియాశీలక సభ్యులు అభిమాని ఆయన లేని లోటు తీర్చలేనిదని సిఐటియు సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, కొడిశాల రాములు, నంద ఈశ్వరరావు, సత్రపల్లి సాంబశివరావు పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య, నాయకులు పుల్లారెడ్డి, ఆర్.లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు (కె.వి.రావు), టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఊకంటి ప్రభాకర్రావు కృష్ణమూర్తి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతి తెలిపారు.