నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండల కేంద్రం తోపాటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, మహిళ అధ్యక్షురాలు జోగుల మంజుల కాంతయ్య అధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం చేస్తు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో సిరిసిల్ల నియోజక వర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నీ ఎమ్మేల్యేగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్, మండల నాయకులు తిరుపతి, కాంతయ్య, చంద్ర మొగిలి, రవిందర్, రాకేష్, లక్ష్మిన్ , దేవయ్య, రాజు,శ్రీనివాస్, రాములు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు.