నవతెలంగాణ-డిచ్ పల్లి : గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పై మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అవగాహన కల్పించారు.శనివారం డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామ పంచాయతీ పరిధిలోని ః రాంపూర్ తాండాలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ్ మాస వారోత్సవాల్లో భాగంగా తండా లో గల గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పై మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అవగాహన కల్పించారు రక్తహీనత కలగకుండా మునగ, ఆకులు, కరివేపాకు ,తాజా ఆకుకూరలు రోజు బెల్లం పల్లి పట్టీలను, కోడి గ్రుడ్డులను ,పాలను తీసుకోవాలని,శిశువులకు బాలామృతం అందజేయాలని, శిశువులకు తల్లిపాలు మాత్రమే పట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఏ. స్వర్ణలత, ఎం.ఎల్.హెచ్.పి రేణుక, అంగన్వాడీ టీచర్ రజిత తదితరులు పాల్గొన్నారు.