నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : పెద్ద కొడపగల్ మండలంలోని అంజని గ్రామానికి చెందిన సాయిరాం,మారుతి,సాయిరాం వారి కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వారికి పార్టీ ఖండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి తరించి భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీలోనే ఉందని అంజని గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు బిఆర్ఎస్ లోకలవడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగ ఉందని ఆయన అన్నారు.అలాగే ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 60 నుండి 70 శాతం వరకు ఉన్నారని మిగిలిన వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రతి గ్రామ గ్రామాన చేరికల కార్యక్రమం ఇకనుండి చేపడతామని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి,బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కండరావు పటేల్,సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి,సొసైటీ డైరెక్టర్ సాయ గౌడ్,ఉప సర్పంచ్ లచ్చ గౌడ్,గ్రామపెద్దలురంజిత్,అంజాగౌడ్,లక్ష్మా గౌడ్,బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.