నవతెలంగాణ- కమ్మర్ పల్లి: వేల్పూరు మండల కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పన్నాల రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు గురువారం మోర్తాడ్ ప్రజా నిలయంలో పన్నాల రాజేశ్వర్ రెడ్డి కి సునీల్ కుమార్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తుందని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకేట రవి, పాలెపు నరసయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.