నవతెలంగాణ – శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని మంత్రి మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన మంత్రి హరీశ్కు.. ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.