– మహేష్కుమార్, నిరంజన్ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నోరు అదుపులో పెట్టుకోవాలంటూ మంత్రి కేటీఆర్ను కాంగ్రెస్ హెచ్చరించింది. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్, జి నిరంజన్ వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. అరచేతిలో స్వర్గం చూపించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు.
కొనసాగుతున్న యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాలు
రెండు రోజులుగా యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాలు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో కొనసాగుతున్నాయి.నిరుద్యోగ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ సమావేశాల్లో గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగ్గారెడ్డి మాట్లాడారు.
హైదరాబాద్కు చేరుకున్న రేవంత్
అమెరికా పర్యటనకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికాలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో ప్రసంగించిన ఆయన…కాంగ్రెస్ ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో రాహుల్గాంధీతోపాటు ఆయన పాల్గొన్నారు.