నవతెలంగాణ – హైదరాబాద్: జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంతో సుపరిపాలన మరింత బలోపేతమవుతుందని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తితోనే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘వార్డు కార్యాలయ వ్యవస్థను కార్పొరేటర్లు విస్త్రృతంగా ఉపయోగించుకోవాలి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం. కార్పొరేటర్లు ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలి.’’ అని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఏడాదిపాటు పార్టీ కార్యకలాపాలను విస్త్రృతం చేయాలని పిలుపునిచ్చారు.