నవతెలంగాణ – సిరిసిల్ల
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి ముందుగా గంబీరావుపేట మండలం గోరంట్యాలలోని పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్లారెడ్డిపేటకు చేరుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్కుమార్తోపాటు పలువురు నేతలు ఉన్నారు. మరికాసేపట్లో సమావేశంలో మంత్రి ప్రసంగించనున్నారు.