నవతెలంగాణ కమ్మర్ పల్లి: రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి వేముల మంజులమ్మ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వగ్రామం వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రిగారైన వేముల సురేందర్ రెడ్డి గతంలోనే మృతి చెందారు.