నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్లో ఇవాళ మరో ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. బోరబండ పీఎస్ పరిధి రాజ్నగర్లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇవాళ సికింద్రాబాద్ బోయిన్పల్లిలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.