నవతెలంగాణ పెద్దవంగర: స్వరాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలందరికీ కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టీ రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నారని, పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ది పథకాలను రూపకల్పన చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలు అమలు చేస్తు బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు సకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను పజల్లోకి తీసుకెళ్లి, వచ్చే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ భూక్యా లష్కర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి రమేష్, నాయకులు మొగులగాని హరీష్, వల్లపు పరమేష్, ఆవుల సోమన్న, ఆవుల వసంత కొమురల్లి, గట్ల సాయి, కొయ్యేడి వీరయ్య, ఆవుల సోమన్న, కొయ్యేడి యాకయ్య, ఆవుల బాలయ్య, వల్లపు వేణు, దేశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.