నవ తెలంగాణ -ఆర్మూర్: పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ అధ్యక్షతన నిర్వహించినారు.. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 18 ఏజెండా అంశాలు 8 సప్లమెంటరీ అంశాలు మొత్తం 25 ఏజెండా అంశాలను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినారు పట్టణ అభివృద్ధికి హరితహారం సానిటేషన్ పై దృష్టి సరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న ,కమిషనర్ ప్రసాద్ చౌహన్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.