నవతెలంగాణ -రేవల్లి
మండల పరిధిలోని నాగపూర్ గ్రామానికి చెందిన బాబు సతీమణి షకీనా బేగం హార్ట్ ఎటాక్ తో బుధవారం రోజు చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న నాగం తిరుపతి రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలను పంపించారని, నాగపూర్ కాంగ్రెస్ కార్యకర్త యండి సుల్తాన్ మరియు పర్వతాలు కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.