నవతెలంగాణ – హైదరాబాద్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ఉపకోటా కల్పించాలని, బిహార్ మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్లతో ఈ నెల రెండో వారంలో హైదరాబాద్లో జాతీయ ఓబీసీ మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ జాజుల నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలేకు ఆహ్వాన లేఖను అందించారు. సదస్సుకు హాజరు కావడానికి సుప్రియా అంగీకరించారని సమావేశానంతరం జాజుల తెలిపారు. రాష్ట్రీయ ఓబీసీ మహసంఘ్ జాతీయ అధ్యక్షుడు భభన్ రాంవ్ తైవాడే, తెలంగాణ బీసీ సంఘాల నేతలు శ్యామ్, విక్రం, శ్రీనివాస్, నగేశ్, భాస్కర్, లింగం ఈ భేటీలో పాల్గొన్నారు.