నవతెలంగాణ- హైదరాబాద్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్ కు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేటలోని ఐటిసి కాకతీయకు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు రాత్రి అక్కడే బస చేయనుంది. ప్రపంచ కప్ మ్యాచ్ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ చేరుకోగా ఈ రెండు జట్లు రేపు మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నాయి.