![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231110-WA0009.jpg)
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్.సి సెల్ అధ్యక్షులు దొన్పాల్ గణేష్, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు, తడపాకల్ గ్రామం నుండి బీజేపీ, బీఎస్పీ నుండి యువజన సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.భీంగల్ మండలం బెజ్జోరా గ్రామం నుండి 25 మంది యువజన సంఘాల సభ్యులు, మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామం నుండి పలువురు కాంగ్రెస్ యువకులు పార్టీలో చేరారు. వేల్పూర్ మండలం లక్కొర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటి సోదరులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.