నవతెలంగాణ -రాజంపేట్: మండలంలోని బసవన్నపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీజ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీజ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… బసవన్నపల్లి నుంచి సోమవారం వరకు సుమారు మూడు కోట్ల 65 లక్షలతో 3.8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గాను ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుమలత, గ్రామ పార్టీ అధ్యక్షులు బాణాల గంగారెడ్డి, సెక్రటరీ సంతోష్రెడ్డి, గడ్డంరాంరెడ్డి, గోపాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ప్రణీత్ రెడ్డి, రూపేష్ రెడ్డి, కిరణ్ రెడ్డి, రాజారెడ్డి, బాలరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.