నవతెలంగాణ-హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. ప్రస్తుతం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి బయల్దేరారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ పరమేశ్వరరెడ్డిని పవన్ కలవనున్నారు. ఇందుకోసం పవన్తో పాటు ఏడుగురిని ఎస్పీ కార్యాలయంలోకి అనుమతించనున్నారు. శ్రీకాళహస్తి జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజూయాదవ్ తీరును తప్పుపడుతూ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ కార్యాలయానికి పవన్ చేరుకుని వినతిపత్రం అందజేయనున్నారు.