శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఇందూరు వారి అధ్వర్యంలో బుదవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 140 మంది విద్యార్థులకు 300 పెన్నులు, 150 బిస్కిట్ ప్యాకెట్స్, 8,9,10 తరగతుల విద్యార్థులకు 80 కంపాస్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఆనంద్, ఎస్. నారాయణ బి.రవి, శ్రీనివాస స్వామి, గంగాభవాని, విజయలక్ష్మి, పిఈటీ డ్రాయింగ్ మాస్టర్ గంగాధర్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నామని అద్యపకులు వివరించారు.