నవతెలంగాణ- వరంగల్: సీతక్కను ఓడించేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని నియమించారు. తనను ఇన్చార్జిగా నియమించిన సీఎం కేసీఆర్కు, కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఎన్నికల్లో ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ములుగును జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించడం ద్వారా ఆయన రుణాన్ని తీర్చుకుంటామని దిమ వ్యక్తం చేశారు.