![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/images-2023-10-04T162317.065-300x200.jpeg)
మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో పోయిన నెల 11 వ తారీకు నుండి అంగన్వాడి టీచర్లు సమ్మెలో ఉన్నారు దీనివల్ల అంగన్వాడికి వచ్చే నిరుపేద పిల్లలకు పౌష్టికాహారం దూరమవుతుందని పలు గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలు పేర్కొంటున్నారు ఇది ఇలా ఉండగా పిల్లలకు చిన్నప్పటినుండే అంగన్వాడి స్కూల్లో అలవాటు చేసి వాళ్లకి ప్రైమర్ స్కూల్లో అడ్మిషన్లు ఇప్పిస్తారు కానీ అంగన్వాడి టీచర్లు సమ్మెలో ఉండటం వల్ల చాలామంది పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారని కొంచెం కొంచెం అక్షరాలను నేర్చుకుంటున్నా అవి కూడా మర్చిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలింతలకు మరియు గర్భిణులకు తగినటువంటి ఆహారం మరియు వాళ్లు పాటించాల్సిన ఆరోగ్య నియమాలు చెప్పడానికి కూడా ఎవరు లేరని వాళ్లు పేర్కొన్నారు. కొన్ని గ్రామాలలో గ్రామ సంఘం రాసి సి ఏ లా తో పాలు గుడ్లు పంచుతున్నారు కానీ అవి సరైన చోట నిల్వ ఉంచక అలాగే పాడైపోయిన గుడ్లను అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గ్రామాలలో మాత్రం పాలు గుడ్లు పౌష్టికాహారం అసలే పంచడం లేదని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాలలో ఉండే ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు