హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల్లో హోం ఓటింగ్కు అవకాశం కల్పించింది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, సిబ్బందితో పాటు మరో 13 విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ, ఫుడ్ కార్పొరేషన్, రైల్వే, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఆర్టీసీ, మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంది.