– తెలంగాణ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ వ్యాప్తంగా పలు హైకోర్టుల్లో 17 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయ మూర్తుల నియమాకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అలాగే పలు హైకోర్టుల్లో విధులు నిర్వహిస్తోన్న 16 మంది న్యాయమూర్తుల బదిలీకి గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ మెఘావాల్ ట్విట్టర్(ఎక్స్)లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ జీ. అనుపమ చక్రవర్తి పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కర్నాటక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నరేంద్ర జీ ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. అలాగే ఏపీ హైకోర్టు నుంచి న్యాయమూర్తులు జస్టిస్ సీ మానవేంద్రనాథ్ రారు గుజరాత్కు, అదనపు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకట రమణ మధ్యప్రదేశ్ కు బదిలీ అయ్యారు. దీంతో పాటు హరీనాథ్ నూనెపల్లి(అడ్వకేట్), కిరణ్మయి కనపర్తి(అడ్వకేట్), సుమతి జగదం(అడ్వకేట్), న్యాపతి విజరు లు ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.