నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన ప్రధాని మోడీ.. బుధవారం నుంచి అగ్రరాజ్యంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండో-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. అంతేగాక, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి బలంగా నిలబడుతున్నాయని స్పష్టం చేశారు.