– లేకపోతే నిరవధిక సమ్మె : తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలనీ, లేకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) హెచ్చరిం చింది. బుధవారం టీటీజీడీఏ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంద ర్భంగా రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి వందలాది మంది కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి తరలివచ్చారు. తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు, బోధనా వైద్యులు బ్యానర్, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నాయకులు ప్రసంగించారు. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, కోశాధికారి కిరణ్ ప్రకాష్ తదితరులు ప్రసంగించారు. సేవ చేస్తున్న తమకు చెల్లించాల్సిన సొమ్ముకు కూడా ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నదని వారు విమర్శించారు. రాష్ట్ర వైద్యరంగానికి పేరు రావడం తామం దిస్తున్న సేవల వల్లేనని గుర్తుంచు కోవాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు, మంత్రితో చర్చించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక చర్చించేది లేదని స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రంలో 56 నెలల పీఆర్సీ బకాయిలను ఏడు నెలలుగా పెండింగ్లో ఉండగా, ముఖ్యమంత్రి సంతకం కోసం ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉంచారని చెప్పారు. ఐదేండ్లుగా పెండింగ్ ఉన్న సాధారణ బదిలీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల పరిధి నుంచి రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల పరిధి లోకి వచ్చే బోధనా వైద్యుల పే ఫిక్సేషన్ సమ స్యను పరిష్కరించాలని కోరారు. నూతన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రయివేటు ప్రాక్టీస్ ను బ్యాన్కు సంబంధించి జీవో 56 తిరిగి పరిశీలిం చాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.