నవతెలంగాణ- హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్లో మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర జాక్పాట్ కొట్టాడు. సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడుతున్న ఈ లెఫ్ట్హ్యాండర్ మళ్లీ టెస్టు జట్టుకి ఎంపికయ్యాడు. ప్రపంచ కప్ తర్వాత బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ రవీంద్రతో పాటు స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ను సెలెక్ట్ చేసింది. సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కెప్టెన్గా 15 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసింది. రవీంద్ర నిరుడు స్వదేశంలో బంగ్లాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. వరల్డ్ కప్లో సంచలన బ్యాటింగ్ చేస్తున్న అతడు ప్రపంచ టెస్టు చాంపియన్ రేసులో కివీస్కు కీలకం కానున్నాడు. టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు నవంబర్ 21న బంగ్లాదేశ్కు బయలుదేరనుంది.
కివీస్ టెస్టు స్క్వాడ్ : టిమ్ సౌథీ(కెప్టెన్), కేన్ విలియమ్సన్, టామ్ బండెల్(వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైలీ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిఫ్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, విల్ యంగ్.