నవతెలంగాణ- జక్రాన్ పల్లి
తల్లి బిడ్డల మిస్సింగ్ కేసు నమోదు అయినట్టు జక్రాన్ పల్లి పోలీసులు ఆదివారం తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి మండల కేంద్రానికి చెందిన గజన వెళ్లి శిరీష(32) ఆమె కూతురు ప్రమిత(6) ఈనెల 19న సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు జక్రాన్పల్లి మండల కేంద్రంలో జరిగే వారసంత కొరకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి బిడ్డల మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని జక్రాన్ పల్లి పోలీసులు తెలియజేశారు.
![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230820-WA0154.jpg)