![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG20231111124420.jpg)
నవ తెలంగాణ-జక్రాన్ పల్లి:
కేసీఆర్ ను తిట్టేస్తాయి రేఖా నాయకులేదని జక్కాన్పల్లి మండల రైతు సమన్వయ కార్యవర్గ సభ్యురాలు మలావత్ జమున బాయ్ అన్నారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ రేఖ నాయక్ టికెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టడం సరైనది కాదన్నారు. టికెట్ ఇవ్వకుంటే తిడతావా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వ పథకాలు పొంది తిన్నింటి వాసాలు లెక్కబెడుతుందని జమున ఆరోపించారు. టికెట్ ఇస్తే సార్ అంటావ్ టికెట్ ఇవ్వకుంటే అరే కేసీఆర్ అని తిడతావా. మరోసారి జాగ్రత్త కేసీఆర్ ను తిడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించారు. రేఖ నాయక్ నువ్వు ఇకనుంచి చిల్లర మాటలు మాట్లాడడం మానేయ్, కేసీఆర్ కు క్షమాపణ చెప్పే వరకు ఊరుకోమని హెచ్చరించారు.