![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230917-WA0233-300x161.jpg)
తెలంగాణవిమోచన దినోత్సవ సందర్బంగా జక్రాంపల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పథకాన్ని ఎగురావేసి విమోచన దినోత్సవ వేడుకలు జరిపారు. కార్యక్రమం లో జక్రాంపల్లి బీజేపీ మండలం అధ్యక్షులు వెంపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యత,సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు వల్లభయ్ పటేల్ మార్గం ఎంతో స్ఫూర్తిని స్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం కల్పించేందుకు పోలీస్ యాక్షన్ ప్రకటించి, నిజాం మెడలు వంచిన మహనీయులు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ .దృఢమైన భారత్ ను నెలకొల్పడంలో వారి కృషి మరువలేనిది అని తెలుపుతూ వారికీ నివాళులు అర్పించారు . దినితో పాటు నరేంద్ర మోడీ జన్మదినము ను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమం లో భాజపా నాయకులు గిరిజనమోర్చా జిల్లా అధ్యక్షులు కిషన్ నాయక్. జిల్లా కార్యవర్గ కొప్పు రాజేందర్.కిషన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దినేష్. కిషన్ మోర్చా మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి. మండల ప్రధాన కార్యదర్శిలు కుంట శ్రీనివాస్ గడ్డం నరేందర్. ఉప అధ్యక్షులు దత్తు గౌడ్. మునిపల్లి సంతోష్. బూత్ అధ్యక్షులు సాగర్. బీజేవైఎం నాయకులు జక్కం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.