నవతెలంగాణ-వీర్నపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం బుధ వారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు లో రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నీ సర్పంచ్ లు పాటి దినకర్, కముటం మల్లేశం లు తన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించి వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు అలాగే శాంతి నగర్ గ్రామంలో వేములవాడ సిరికొండ రోడ్డు రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు ఆగిపోయింది పనుల గురించి వివరించి గుంతల రొడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యానికి గురివుతున్నారనీ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రినీ కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి రోడ్డు పనులు త్వరలోనే పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు రవి నాయక్, మల్లేశం, బి అర్ ఎస్ మాజి మండల అధ్యక్షులు శ్రీరామ్ నాయక్, మండల నాయకులు జోగిని పల్లి మల్లేశం ఉన్నారు.