నవతెలంగాణ-హైదరాబాద్ : ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. యూపీఐ సేవల్లో ఎస్బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురు కావొచ్చునని తెలిపింది. ఎస్బీఐ టెక్నాలజీ అప్గ్రెడేషన్ చేపట్టింది. దీంతో ఎస్బీఐ కస్టమర్లకు యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశముంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించింది. గత రెండు రోజులుగా ఎస్బీఐ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో కస్టమర్లు సమస్య ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా సమస్య వస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదని, వారు ఈ సమస్యను ఆనందిస్తున్నట్లుగా ఉన్నారంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టెక్నాలజీ అప్ గ్రెడేషన్ కారణంగా ఎస్బీఐ కస్టమర్లు యూపీఐ సేవలలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చునని తెలిపారు.