– కదలని చెత్త సేకరణ వాహనాలు
– మున్సిపల్లో ఎత్తని చెత్త
– శుభ్రం చేయని మురుగు కాలువలు
– మున్సిపల్లో ఆస్తవ్యస్తంగా మారిన శానిటేషన్
– పట్టించుకోని ఉన్నతాధికారులు
– చెత్తతో కంపుగొడుతున్న వైనం
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్లో శానిటేషన్ విభాగం అస్తవ్య స్తంగా మారింది. మున్సిపల్లో ఏ వార్డులో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్లో చెత్తను ఎత్తక పోవడంతో ప్రజలు దుర్గదంలో వచ్చే వాసనతో ఇబ్బందు లు పడకతప్పడం లేదు. మున్సిపల్లో అధికారుల, ప్రజాప్ర తినిధుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. మున్సిపల్లో వాహనాలకు డిజిల్ కొరత కా రణంగా బుధవారం మున్సిపల్ నుండి ఒక్క వాహనం కూ డా కదలలేదు. కార్మికులు చేసేది ఏమీ లేక ఖాలీగా ఉండా ల్సిన పరిస్థితి ఎర్పడింది. అసలే వానాకాలం పారిశుధ్యం లో పించడంతో ప్రజలు రోగాల పాలయ్యే అవకాశాలున్నాయి. పట్టణ ప్రజలు అసలే రోడ్లు, వాయు కాలుష్యంతో ఇబ్బందు లు పడుతుంటే దానికి సరిపోదంటూ మళ్లీ శానిటేషన్ ఇబ్బందులు ప్రజలను అనేక వ్యాధుల బారినపడేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో శానిటేషన్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను ఎత్తేయ డంలో శానిటేషన్ విభాగం పూర్తిగా విఫలమైంది. రోజు వార్డుల్లో పూర్తి స్దాయిలో తొలగించడం లేదు. మున్సిపల్లో శానిటేషన్పై పర్యావేక్షణ లేకపోవడం కారణంగానే సంబం ధిత అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని పలు వురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్లో శానిటేష న్పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అధికారులు, చూసీ చూడన ట్లు వ్యవహారించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని ఉన్నతాధికా రుల, నాయకుల దృష్టికి తీసుకొస్తున్న యథావిధిగానే శాని టేషన్ సమస్య నెలకొంటుందని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మున్సిపల్లో ట్రైసై కిళ్లు, ట్రాక్టర్లు, ఆటోలు పోని ప్రదేశాలకు గల్లీలకు ట్రైసైకిళ్ల తో చెత్త సేకరణ జరుగుతుందని అన్నారు కానీ మాటలు అమలు కావడం లేదు. పట్టణంలో శానిటేషన్ మెరుగు పడేందుకు గతంలో రూ. 13లక్షల 40వేలతో ట్రైసైకిళ్లు, తోపుడు బండ్లు కొనుగోలు చేసి శానిటేషన్ సమస్య పరిష్కా రిస్తమన్నారు కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇచ్చి న ట్రైసైకిళ్లు కూడా మూలన పడ్డాయి. పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకపోతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు. పట్టణంలో పారిశుధ్య కార్మికులు చెత్తను ఎత్తేయడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శానిటేషన్ సమస్యను బాగు చేయాలని పట్టణంలో శానిటే షన్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు
కోరుతున్నారు.