– ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలు
– రేట్లు నిర్ణయించిన కేంద్ర ఎన్నికల సంఘం
– వ్యయం వివరాలను రెండు రోజులకోసారి చెప్పాలి
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్య ర్థుల ఎన్నికల ఖర్చులపై మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. సంబంధిత అధికారులు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు ప్రత్యేక దష్టి కేంద్రీకరించారు. ఈ విష యంలో అభ్యర్థులు ఎన్నికల కమిషన్ సూచించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేస్తే అధి కారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఇప్పటికే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి రోజూ ఉదయం టిఫిన్ మొదలు ప్రచారం, తదితర కార్యక్రమాలు ము గిసే సమయం వరకు ఎన్నికల సంఘం రేట్లను నిర్ణయించింది. ఈ రేట్ల ప్రకారమే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జిల్లా అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. ఒక్కో పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి ఖర్చు ఎన్నికల్లో రూ.40 లక్షలకు మించొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్య ర్థులు రోజు వారీగా చేసే ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళిక రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.40 లక్షలకు మించి వ్యయం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
అభ్యర్థుల ఖర్చు సేకరణకు అధికారులు..
జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల రోజు వారీ ఖర్చు వివరాల సేకరణకు ఎన్నికల వ్యయ పరి శీలకులుగా జిల్లా ట్రెజరీ అధికారి యాదగిరి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు వ్య వహరిస్తున్నారు. వీరు ప్రతిరోజూ ఆయా పార్టీ లకు సంబంధించిన ఎన్నికల ఖర్చుల వివరాల ను సేకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రా రంభం నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వర కు చేసే ప్రతి పనికీ అయ్యే ధరల వివరాలను ఎన్నికల కమిషన్ రూపొందిం చింది. దాని ప్రకారం ఎక్కడెక్కడ ఏఏ కార్యక్రమాలు నిర్వహించినా ఎన్నికల కమిషన్ ప్రకారం ఖర్చులను పరిగణలోకి తీసుకుంటారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నిర్ణీత ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చయితే సంబంధిత అభ్యర్థిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ అన్ని రకాల పకడ్భందీ కార్యాచరణతో ఉంది. ఈ విషయంలో జిల్లాలోని అధికారులు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిరంతరం నిఘా ఉం చారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థుల ఖర్చుపై వ్యయ పరిశీలకులు నిరంతరం నిఘా ఉంచుతారు. జిల్లా వ్యయ పరిశీలన బందం ఖర్చు వివరాలను ఎప్పటిక ప్పుడు షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ నమోదు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. అభ్యర్థుల వ్యయం వివరాలను రెండు రోజులకోసారి అధికా రులకు సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే అభ్యర్థులకు నోటీసులు అందిస్తారు. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకుని అభ్యర్థులు జా గ్రత్తగా వ్యవహరించాల్సి ఉం టుంది. అభ్యర్థులు ఎన్నికల ప్రచార సమయంలో ఖర్చుకు సంబందించి లెక్కలను సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే చర్యలు తీసుకుంటారు. వ్యయ పరిశీలకుల నిఘా ఎప్పటికప్పుడు అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంటుంది. ఎన్నికల సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులు వెచ్చించే ఖర్చు వివరాలను ఇప్పటికే ఎన్నికల సంఘం వెలువరించింది.
ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి : గౌతమ్, మేడ్చల్- మల్కాజిగిరి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్
ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థుల వ్యయంపై ఎన్నికల వ్యయ పరి శీలకు లు ఎప్పటి కప్పుడు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చాలి. అభ్యర్థులు తమ వ్యయం వివరాలను రెండు రోజుల కోసారి అధికారులకు సమర్పించాల్సి ఉం టుంది. లేకుంటే అభ్యర్థులకు నోటీసులు అందజేస్తాం. ఈ విషయాన్ని దష్టిలో పెట్టు కుని అభ్యర్థులు ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాలి. లేకుంటు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల వ్యయ పరిశీలకులు జాగ్రత్తగా వ్యవహరించాలి.