నవతెలంగాణ- ఆర్మూర్: పట్టణంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన నవనాథ సిద్దుల గుట్టపై సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. సిద్దుల గుట్టపై శివాలయం, రామాలయం, దత్తాత్రేయ, అయ్యప్ప ఏకశీల స్తంభం, హనుమాన్ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పి సి గంగారెడ్డి, గంగా కిషన్, అయ్యప్ప శ్రీనివాస్, నక్కల లక్ష్మణ్, బొండ్ల ఆనంద్, మీనా చంద్ తదితరులు పాల్గొన్నారు