నవతెలంగాణ – చెన్నై : వేలాంకన్ని ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని ముంబై-వేలాంకన్ని మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ నెల 26వ తేది మధ్యాహ్నం 1 గంట కు ముంబై నుంచి బయల్దేరే రైలు మూడో రోజు రాత్రి 10.35 గంటలకు వేలాంకన్ని చేరుకుంటుంది. మరో మార్గంలో వేలాంకన్ని నుంచి ఈ నెల 28వ తేది ఉదయం 6 గంటలకు బయల్దేరే రైలు మరుసటిరోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబై చేరుతుంది. సెప్టెంబరు 6వ తేది మధ్యాహ్నం 1.40 గంటలకు ముంబై నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు మూడో రోజు అర్ధరాత్రి 12.30 గంటలకు వేలాంకన్ని చేరుకుంటుంది. మరో మార్గంలో వేలాంకన్ని నుంచి సెప్టెంబరు 8వ తేది రాత్రి 11.50 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు మూడో రోజు ఉదయం 7 గంటలకు ముంబై చేరుకుంటుంది.