నవతెలంగాణ- తమిళనాడు: మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ నిడుమోలు మాలాను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈమె మహాకవి శ్రీశ్రీ కుమార్తె. గత సంవత్సరం మార్చిలో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈమెతోపాటు మద్రాసు హైకోర్టులో జస్టిస్ ఏఏ నక్కీరన్, జస్టిస్ ఎస్.సౌందర్, జస్టిస్ సుందరమోహన్, జస్టిస్ కె.కుమరేష్బాబును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది.