నవతెలంగాణ-మహాముత్తారం
ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏఐసీసీ కార్యదర్శి, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మహాముత్తారం మండలంలోని యామన్ పల్లి లో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేరవే స్తామని తెలిపారు. అధికారం లోకి రాగానే వాటిని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందుబాటులో తీసుకొస్తామ ని అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ చెప్పుకోవడానికి పథకాలు తదితరులు ఏమీ లేక కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తుందని అన్నారు. అనంతరం మహా ముత్తారంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారం భించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో యువత చేరికల జోరు
మల్హర్రావు : మంథని నియోజకవ ర్గంలో యువత కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ చేరికల జోరు ఊపందుకొంటుంది. సోమవారం మండలంలోని గాధంపల్లి,కొయ్యుర్, తాడిచెర్ల గ్రామాలకు చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీపాధ ట్రస్టు చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ యువ వికాసం పథకానికి ఆకర్షనీతులై యువత కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తుందన్నారు. యూత్ నాయకులు రాహుల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
మహాదేవపూర్ : ఏఐసీసీ కార్యదర్శి,మాజీ మంత్రి వర్యులు,మేనిఫెస్టో ఛైర్మన్, ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమక్షంలో మహాదేవపూర్ టీడీపీ మండల అధ్యక్షులు వీరమల్ల రాజబాపు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే రాపల్లికోట గ్రామ బీఆరఎస్ యూత్ ప్రెసిడెంట్ బత్తిని కిష్ట స్వామి, గడ్డం రామకష్ణ, ఓదెలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
మహాముత్తారం : మాహా ముత్తారం మండలంలోని రెడ్డిపల్లి, వజినేపల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు సోమవారం ఏఐసీసీ సెక్రెటరీ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీదర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి శ్రీ దుద్దిళ్ళ శ్రీదర్ బాబు ఆహ్మానించారు.