నవతెలంగాణ- తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న కంపార్టుమెంట్లలో 7 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.నిన్న స్వామివారిని 75,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,700 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చిందని వెల్లడించారు.