నవతెలంగాణ-హైదరాబాద్ : ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. నిన్నటి దరలే ఈరోజు కూడా నమోదు అయ్యాయి. గత కొన్ని రోజుల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా నమోదు అవుతున్నాయి.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54, 850 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,840 పలుకుతోంది. ఇక వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం కిలో రూ.73,500లకు లభిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఇలాగే ఉన్నాయి.