నవతెలంగాణ-హైదరాబాద్ : పసిడి ప్రియులకు ఊరట. వరుసగా పెరిగిన బంగారం ధరలు గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఆగష్టు 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 76,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. కిలో వెండి ధర రూ. 76,900గా ఉంది.