నవతెలంగాణ – ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు, చైనా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 388 పాయింట్లు కోల్పోయి 65,151కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 19,365 వద్ద స్థిరపడింది.