నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడ్ నిర్ణయం, కార్పొరేట్ల ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. మరోవైపు విదేశీ మదుపరుల అమ్మకాలు, క్రూడాయిల్ ధరలు పెరుగుతుండడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు ఫ్లాట్గా ముగిశాయి.