![sensex-is-at-67-thousand](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/Market-1.jpg)
నవతెలంగాణ – ముంబాయి: దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేటింగ్ను ఫిచ్ తగ్గించింది. అలాగే రాబోయే మూడేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పతనమయ్యే ఛాన్స్ ఉందని సంకేతాలిచ్చింది. దాంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపై పడింది. మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 289 పాయింట్లు తగ్గి 66,170 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల పతనమై రూ.19,646 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెన్సెక్స్ 999.12 పాయింట్ల వరకు నష్టపోయింది.