నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగా ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో 63,400 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప లాభంతో 18,820 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.11 దగ్గర ప్రారంభమైంది.