నవతెలంగాణ – ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 82 పాయింట్లు లాభపడి 66,610 వద్ద.. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 19,774 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.30 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, హీరో మోటో కార్ప్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా.. పవర్ గ్రిడ్ కార్ప్, ఓఎన్జీసీ, మారుతి సుజికి, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.