![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230916-WA0010-300x135.jpg)
నవతెలంగాణ-కంఠేశ్వర్ : తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో డి ఈ ఓ కి సమ్మె నోటీసు శనివారం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ లు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించినందున ఈనెల 28 నుండి రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం బంద్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా డీఈవో కి సమ్మె నోటీసు అందజేయడం జరిగిందని అన్నారు, ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు వేల రూపాయల గౌరవ వేతనం, జిల్లాకు రావలసిన ఎనిమిది కోట్ల పెండింగ్ బిల్లులు, వంట పాత్రలు, వంట షెడ్లు, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు, అందరికీ ఒకే రకమైన కాటన్ యూనిఫాంలు, రాగి జావా, కొత్త మెనూ అమలుకు అదనపు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈనెల 28 నుండి జరిగే సమ్మెలో వంట బంద్ చేసి మధ్యాహ్న భోజన కార్మికులందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్ రెడ్డి, తుకారం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.