నవతెలంగాణ – సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద సీసీగా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆదివారం పోలీసులు గుర్తించారు. కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్షిప్ వద్ద కాలిన గాయాలతో విష్ణువర్థన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విష్ణువర్థన్కు భార్య శివ కఅష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. నిన్న రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదు. విష్ణువర్ధన్ది హత్యా ? ఆత్మహత్యా ? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా ? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా ? అనే కోణంలోనూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.