నవతెలంగాణ-డిచ్ పల్లి : అనుమానాస్పద గా ఓ వివాహిత ఇంట్లో ఉరివేసుకొని అత్మహాత్య చేసుకున్న ఘటన ఇందల్ వాయి పోలిస్ నేషన్ పరిధిలోని గన్నరం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందల్ వాయి ఎస్ఐ ఎస్ మహేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కాసుల సవిత 2008లో గన్నారం గ్రామానికి చెందిన కాసుల నాగేష్ తో వివహమైనట్లు తెలిపారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పెద్దపాప లక్కి 8వ తరగతి 2వ పాప కావ్య 7వ తరగతి. 3వ పాప శ్రావ్య 2వ తరగతి చదువుతున్నట్లు వివరించారు. భర్త నాగేష్ బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశానికి వేళ్ళరు. ఇట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న తలుపులను బిగించుకుని చిరేతో సిలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతిచెoదరు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
కాసుల సవిత ఎందుకు అత్మహత్య చేసుకుందో దర్యాఫ్తు చేపడుతున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. మృతురాలి తల్లి ఇచిన పిర్యాదు తో కేసూ నమొదు చేసుకోని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద కేసు గా నమోదు చేశారు.