![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230718-WA0110.jpg)
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా లో పలువురు ఎస్సై లకు బదిలిలు చేపట్టారు. దానిలో భాగంగానే డిచ్ పల్లి ఎస్సైగా యు మహేష్, ఇందల్ వాయి ఎస్సైగా సిలివేరి మహేష్ లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. యు మహేష్ నిర్మల్ జిల్లా లోని బాసర పోలీస్ స్టేషన్ నుండి సిలివేరి మహేష్ నిర్మల్ పట్టణం నుండి బాదిలిలపై అంతా పోలిస్ స్టేషన్ లకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజి పడకుండా కృషి చేస్తామని, ప్రజలు పోలిసులకు సహకరించాలని వారన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలకు పోలిస్ సిబ్బంది శూబాకంక్షలు తెలిపారు.
![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230718-WA0100.jpg)
![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230718-WA0100.jpg)